Saturday, May 4, 2024

సారంపల్లి గ్రామం నుండి ఎన్నికల ప్రచారం షురువు చేసిన కేటీఆర్

spot_img

రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం నుండి ఎన్నికల ప్రచారం షురువు చేసారు మంత్రి కేటీ రామారావు. సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో సారంపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ, గీత కార్మికుల సంక్షేమ సంఘం ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుపరిచి వారి అభ్యున్నతికి కృషి  చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచారం సారం పెళ్లి గ్రామం నుండి మొదలు పెడుతున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ మరోసారి వస్తేనే రాష్ట్ర ప్రగతి ముందు వెళ్తుందని ఇతర పార్టీలు ఎన్ని వచ్చినా కూడా ప్రగతి వెనక్కి వెళ్తుందని తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్నారు.

Latest News

More Articles