Saturday, May 18, 2024

కొడుకుకు ఉరివేసి, ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి

spot_img

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‎లో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. విశ్వనాథ్, శిరీష దంపతులు వినాయక నగర్‎లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల కొడుకు మనీష్ ఉండగా.. ప్రస్తుతం శిరీష మూడు నెలల గర్భవతి. కాగా.. కొన్నాళ్ల నుంచి అత్తింటి వేధింపులు జరుగుతున్నా.. కొడుకు కోసం అన్నీ భరిస్తూ వచ్చింది. అయితే తాజాగా మరోసారి వేధింపులు ఎదుర్కొవడంతో శిరీష తీవ్ర మనస్థాపానికి గురైంది. దాంతో కొడుకు మనీష్‎కి ఉరివేసి, తాను కూడా ఉరి వేసుకొని శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన ఫిల్మ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles