Friday, May 3, 2024

శ్రీశైలం మహాప్రసాదంలో ఎముక ముక్క..!!

spot_img

శ్రీశైలం దేవస్థానం పులిహోర ప్రసాదంలో మాంసానికి చెందిన ఎముక వచ్చిందని భక్తులు చెప్పడం కలకలం రేపింది. హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కె.వేణుగోపాల్ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనం ముగిసిన అనంతరం అమ్మవారి ఆలయం వెనక నిత్యప్రసాద వితరణలో భాగంగా పులిహోరను సిబ్బంది అందజేశారు. ప్రసాదం తింటున్నప్పుడు నోటికి గట్టిగా తగిలిందని..గట్టిగా కొరికితే అది రెండు ముక్కలైందని వేణుగోపాల్ తెలిపాడు. చేతిలో వేసుకుని చూస్తే అది మాంసం ఎముకగా గుర్తించామని తెలిపారు. దీనిపై ఆలయ ఏఈవో హరిదాస్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి :ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం..రెండు లారీలు, ప్రైవేట్ బస్సు ఢీకొని నలుగురు మృతి..!!

Latest News

More Articles