నెల్లూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర శుక్రవారం అర్థరాత్రి దాటక 2 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొన్నది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. అదే సమయంలో ఎదురుగా ప్రైవేట్ బస్సు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగా నుజ్జునుజ్జు అయ్యింది.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మ్రుతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చదవండి: మీ బట్టతలపై జుట్టు పెరగాలంటే.. మొలకెత్తిన ఈ గింజలను తినండి!