Sunday, May 19, 2024

హబీబ్ నగర్ లో రౌడీషీటర్ హల్చల్

spot_img

హైదరాబాద్: హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ ముగ్గురి పై కత్తితో దాడి చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. కత్తిపోట్లకు గురైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన దర్గా షాఖామూష్ దగ్గర చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. రౌడీషీటర్ మోయిద్ అలియాస్ అండా రోటి తన స్నేహితులతో కలిసి గాంజ మత్తులో లతీఫ్ అనే యువకుడిని అడ్డుకొని డబ్బులు ఇవ్వమని బెదిరించారు. దీంతో లతీఫ్ తన నివాసానికి పరిగెత్తి తన అన్న మహమ్మద్ జహూర్ కి విషయం చెప్పాడు. వారు వచ్చి మోయిద్ ను నిలదీయడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో జహుర్ పై మోయిద్ అతని స్నేహితులు కత్తితో దాడికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు అడ్డుకోగా వారిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ జహుర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా, మోయిద్ రోజు గాంజా సేవించి వచ్చే వారిపై దాడికి పాల్పడి డబ్బులు వసూలు చేస్తాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అతడిపై నామమాత్రంగా కేసులు పెట్టి వదిలేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న హాబీబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి.. బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Latest News

More Articles