ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇద్దరు నూతన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ నియమితులు కానున్నారు.
ఈరోజు ఉదయం గం.10.30లకు సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిద్దరి నియామకంతో అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య 34కు చేరుతుంది.