Monday, May 20, 2024

నాందేడ్ లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్

spot_img

హైదరాబాద్: నాందేడ్ లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఇందుకోసం నాందేడ్ అనంత్ లార్స్ లో వేదిక సిద్ధమైంది.

అన్ని నియోజక వర్గాల నుండి మరాఠీ నేతలు తరలి రానున్నారు. ఇప్పటికే కేసీఆర్ విజన్ కు ఫిదా అయిన మహారాష్ట్ర రైతు ఉద్యమ కారులు, మేధావులు, కాంగ్రెస్, బీజేపీ, శివ సేన పార్టీలకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు. కేసీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మరాఠా నేతలు చెప్పారు.

Latest News

More Articles