హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికు మాతృవియోగం కలిగింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి తల్లి పద్మమ్మ (92) మృతిచెందారు. పద్మమ్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.