Saturday, May 18, 2024

దేశ రాజధానిలో యువతి దారుణ హత్య.. తీవ్రంగా స్పందించిన కేజ్రీవాల్

spot_img

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఓ 20 ఏండ్ల యువకుడు 16 ఏండ్ల యువతిని అందరూ చూస్తుండగా 21 సార్లు కత్తితో పొడిచి, బండరాయితో మోది దారుణంగా చంపడం స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. రోహిణి షాహబాద్‌ డెయిరీలోని ఒక వీధిలో ఈ ఘటన జరిగింది. యువతిని చంపుతుంటే.. దారిన పోయేవారు చూస్తున్నారే తప్ప ఆపేందుకు ప్రయత్నించలేదు. నిందితుడిని ఏసీ మెకానిక్ సాహిల్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతడిని యూపీలోని బులన్‌షహర్‌లో అరెస్ట్‌ చేసినట్టు ప్రత్యేక పోలీస్‌ కమిషనర్‌ దీపేంద్ర పాఠక్‌ చెప్పారు.

మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత ఎల్జీ చేతుల్లో ఉంటుందని, కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలివాల్‌ యువతి హత్యపై స్పందించారు. మహిళలకు ఢిల్లీ ఎంతమాత్రం సురక్షిత ప్రదేశం కాదని వ్యాఖ్యానించారు.

Latest News

More Articles