Saturday, May 4, 2024

సికింద్రాబాద్ జ్యువెలరీ డోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

spot_img

హైదరాబాద్: సికింద్రాబాద్ జ్యువెలరీ డోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్ర థానేకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ కు సహకరించిన సిటీకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

దోపిడీకి పాల్పడ్డ ముఠా వారం రోజులపాటు సిటీలో మకాం వేశారని, బంగారు షాప్ సమీపంలోనే లాడ్జిలోనే నిందితులు ఉండి పలుమార్లు రెక్కీ నిర్వహించారని పోలీసులు వివరించారు. చోరీ చేసిన బంగారాన్ని ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఐటీ అధికారులమంటూ ముఠా సభ్యులు 1700 గ్రాముల బంగారు బిస్కెట్లను చోరీ చేసిన విషయం తెలిసిందే.

Latest News

More Articles