హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ స్కీం కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిమాండును ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబర్ 5వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరో 11 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండనున్నారు. సోమవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.