Sunday, May 12, 2024

ఆసియా గేమ్స్‎లో ఫైనల్‌ చేరిన భారత్‌

spot_img

ఆసియా గేమ్స్ 2023 మహిళల క్రికెట్‌లో భారత్‌ ఫైనల్‎కు చేరింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో భాతర మహిళల టీం ఆసియా క్రీడల్లో ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో సత్తా చాటడంతో టీమిండియాకు పతకం ఖాయమైంది. ఫైనల్‌లో గెలిస్తే ఏకంగా స్వర్ణమే భారత్ ఖాతాలో చేరుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. భారత బౌలర్ల దాటికి 51 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ 4 వికెట్లతో చెలరేగింది. బంగ్లా బ్యాటర్లలో నిగార్‌ సుల్తానా 12 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. కాగా.. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. లక్ష్య ఛేదనలోకి దిగిన భారత్.. రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో భారత్ బోణీ చేసింది. షూటింగ్, రోయింగ్‌, భారత్ లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌లో రజత పతకాలు సాధించింది.

మరిన్ని వార్తలు..

తిరుమల వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్
21 కేజీల లడ్డూ ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్ స్టూడెంట్స్

Latest News

More Articles