Sunday, May 5, 2024

అమెజాన్ ప్రైమ్‌ యూజర్లకు బిగ్ షాక్‌!!

spot_img

న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్ టాప్‌ ఓటీటీ సంస్థల్లో ఒకటి. నిరంతరం కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గతంలో ఒక్క సబ్‌స్క్రిప్షన్‌ పైన నాలుగు డివైజ్‌లు ఒకే సారి చూసే వెసలుబాటు కల్పించడంతో ఖాతాదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఇన్నాళ్లు యాడ్‌ను స్కిప్‌ చేసే వెసులు బాటు కల్పించిన ప్రైమ్‌.. ఇకపై డబ్బులు చెల్లిస్తేనే స్కిప్‌ చేసే ఆప్షన్‌ను ఇవ్వనుందట. ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read.. పాలమూరును ఐటీ ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నాం

ఇప్పటి వరకు సినిమా/వెబ్‌ సిరీస్‌ స్టార్ట్‌ అయ్యే ముందు మాత్రమే యాడ్ వచ్చేది. ఇకపై సినిమా/వెబ్ సిరీస్ చూసేటప్పడు మధ్యలో కూడా పరిమిత సంఖ్యలో యాడ్స్ ప్రసారం చేయాలని ప్రైమ్‌ సంస్థ భావిస్తుందట. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయాలని ప్రైమ్ కసరత్తులు చేస్తోందట. ఇకపై యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ చూడాలంటే ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్‌లు అదనంగా మరికొంత రుసుము చెల్లించాల్సిందే. ఇప్పటికే హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో ఈ స్ట్రాటజీ అమలులో ఉంది.

మరిన్ని వార్తలు..

తిరుమల వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్

Latest News

More Articles