రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంతలు హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ సినిమా టైటిల్ సాంగ్, ఆరాధ్య సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై మంచి ఓపెనింగ్స్ని అందుకుంది. విజయ్, సామ్ల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాగా.. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ను లాక్ చేసుకుంది. ఖుషి సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రిరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. చివరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. దాంతో అక్టోబర్ 1 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. కాగా.. నిడివి కారణంగా కట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఓటీటీ స్ట్రీమింగ్లో యాడ్ చేశారట. ముఖ్యంగా విజయ్, సామ్ల రొమాంటిక్ సీన్స్ ఇందులో చూపించబోన్నట్లు తెలుస్తోంది.