సూర్యాపేట జిల్లా మోతె మండలం మావిళ్ళగూడెం వద్ద టీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ముందు వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పగలడంతో వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగిందని, ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయిందన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
Also Read.. రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్షేమం