Friday, May 3, 2024

డ్రగ్స్ కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదు

spot_img

డ్రగ్స్ కేసు విషయంలో తన ప్రమేయంపై వస్తున్న వార్తలను సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఖండించారు.గతంలో వరలక్ష్మి దగ్గర పని చేసిన ఓ మేనేజర్‌‌ను ఇటీవల కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఆమెకు కూడా సంబంధం ఉందా అనే కోణంలో నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ‘రాజు గారి గది’ ఫేమ్ ఓంకార్ దర్శకత్వంలో వస్తున్న ‘మాన్షన్ 24’ హారర్ వెబ్ సిరీస్‌ లో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మి ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌లో ఈ విషయంపై స్పందించారు.

అసలు ఈ డ్రగ్స్ కేసులో తన పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారో తెలిపారు వరలక్ష్మి. అంతేకాదు.. డ్రగ్స్ కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకేం సమన్లు రాలేదు. గతంలో నా దగ్గర ఓ మేనేజర్‌‌ పని చేశారు. ఆయన తీసుకొచ్చిన రెండు మూడు సినిమాలు నేను చేశాను, మా మధ్య ఉన్నది అంతే. ఆ తర్వాత ఏం జరిగిందనేది, ఆయన వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. ఆయన ఇన్వాల్వ్ అయిన కేసుకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన పేరు, ముఖం వేసి వార్తలు రాస్తే ఎవ్వరూ చదవరు కదా? వరలక్ష్మి మేనేజర్ అంటే అంతా చూస్తారు. అందుకే నా పేరును ఇందులోకి తీసుకొచ్చారని తెలిపారు.

Also Read: మేడారం సమ్మక్క,సారలమ్మ ప్రధాన పూజారి మృతి

Latest News

More Articles