Sunday, May 19, 2024

వివాదంలో మునుగోడు బిజెపి అభ్యర్థి.. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు

spot_img

నల్గొండ : మునుగోడు బిజెపి అభ్యర్ధి చలమల కృష్ణారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. కృష్ణారెడ్డి పై భూ కబ్జా ఆరోపణలు పెద్దఎత్తున బయటకు వచ్చాయి. తమ 200 ఎకరాల భూమిని కబ్జా చేశారని కృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని బాధితులు సోమవారం ముట్టడించారు.

Also Read.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ

తమ భూమి కబ్జా చేసిన కృష్ణారెడ్డి మా కుటుంబ సభ్యుల్ని ఇద్దర్ని హతమార్చాడని మీడియా ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు. శివప్రసాద్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి కిడ్నీలు తొలగించాడని చెప్పారు. కృష్ణారెడ్డి అరాచకాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ నుంచి తప్పించుకునెందుకే కృష్ణారెడ్డి బిజెపిలో చేరాడని ఆరోపించారు. చలమల కృష్ణారెడ్డి నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారు పేర్కొన్నారు.

Latest News

More Articles