హైదరాబాద్ : వైఎస్సార్టీపీ బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయింది. వైఎస్సార్టీపీ పార్టీ నుంచి పలువురు నేతలు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. వైఎస్సార్టీపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్వాగతం తెలిపారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నమ్మించి తమను నట్టేట ముంచిన షర్మిలపై ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తాము భావించి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు.