Friday, May 17, 2024

ముగిసిన ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ టూర్

spot_img

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ టూర్ ముగిసింది. ఇవాళ ఉదయం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సీఎం జగన్‌.. బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. కేసీఆర్‌ను పరామర్శించి.. దాదాపు గంట పైగా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఆ తరువాత లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. అక్కడ.. తన తల్లి విజయమ్మతో కలిసి లంచ్ చేశారు.

ఇక తల్లి విజయమ్మతో జగన్ దాదాపు అరగంటకి పైగా భేటీ అయ్యారు. పలు విషయాల గురించి చర్చించారు. సీఎం జగన్ రెండు సంవత్సరాల నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే వచ్చారు. చివరిసారిగా శ్రీ కృష్ణుడి వేడుకలకు హాజరయ్యారు. హైదరాబాద్ పర్యటన ముగించుకొని బేగంపేట ఎయిర్ ఫోర్ట్ కు బయలుదేరి వెళ్లారు.

Latest News

More Articles