చెన్నైలో ఐడియాస్2ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మురళి తన 50 మంది ఉద్యోగులకు వివిధ రకాల సరికొత్త కార్లను బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. పండుగల సందర్భాల్లో కంపెనీలు ఒకట్రెండు నెలల జీతం బోనస్గా ఇస్తేనే ఆ ఉద్యోగులు ఎంతగానో సంబరపడతారు. మరి అలాంటింది ఊహించని గిఫ్ట్ రావడంతో ఎగిరి గంతేశారు.
Also Read.. శబరిమలకు వెళ్లే అయ్యప్పలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు
కంపెనీ స్థాపన నుంచి మద్దతుగా నిలిచిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వివిధ రకాల బ్రాండ్-న్యూ కార్లను బహుమతిగా ఇచ్చినట్లు మురళి తెలిపారు. అదేవిధంగా 33 శాతం షేర్లను మొదటి నుంచి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అందజేస్తామన్నారు. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం చెల్లించేందుకు కంపెనీ గతేడాది 100 కార్లను బహుమతిగా ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు.