న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత పవన్ ఖేడాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో నమోదైన ఎఫ్ఐఆర్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
Also Read.. సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే!
ప్రధాని నరేంద్ర మోదీపై పవన్ ఖేడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా.. హజ్రత్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించగా.. ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.