Friday, May 3, 2024

పేటీఎంకు మరో భారీ షాక్…రూ 5. 49కోట్లు జరిమానా.!

spot_img

పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కష్టాలు తగ్గడం లేదు. మనీలాండరింగ్ నిబంధన ఉల్లంఘన కింద రూ. 5.49కోట్ల జరిమాన విధించారు. ఈ జరిమానాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విధించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఆన్ లైన్ జూదం సహా అనేక అనైతక కార్యకాలపాల విషయంలో కొన్ని సంస్థలకు సంబంధించిన ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల నుంచి నిర్ధిష్ట సమాచారాన్ని ఈ యూనిట్ అందుకుంది. అనంతరం సమీక్ష నిర్వహించిన పేటీఎంపై భారీ మొత్తంలో జరిమానా విధించింది. చట్టవిరుద్ధమైన కార్యాకలాపాల నుంచి వచ్చిన సొమ్మును ఆయ సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతా లనుంచి మళ్లించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పేటీఎం బ్యాంకుకు రూ. 5.49కోట్ల పెనాల్టీ విధించింది.

ఇది కూడా చదవండి: భర్తలను భార్యలు పొట్టు పొట్టు కొట్టేది ఎక్కడో తెలుసా..!!

Latest News

More Articles