కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న హర్యానాలోని నుహ్ లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. కొన్ని నెలల క్రితం, నుహ్లో భారీ మత హింస జరిగిన సంగతి తెలిసిందే. బ్రజమండల యాత్రపై దాడి ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. దాదాపు రెండు నెలల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే తాజాగా గురువారం మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. గురువారం రాత్రి నుహ్లోని మసీదు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ రాళ్లదాడిలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు.
#WATCH | After reports of stone-pelting in Haryana’s Nuh, SP Nuh, Narendra Singh Bijarniya says, “Some females were going for ‘Kuan Poojan’ and there has been a complaint that stones were pelted by some children from the madrasa. People from both communities gathered here in this… pic.twitter.com/oM2XtQLq1y
— ANI (@ANI) November 16, 2023
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 8.20 గంటల ప్రాంతంలో రాళ్ల దాడి ఘటన జరిగింది. ‘బాగా పూజ’ కోసం మహిళలు గుంపుగా వెళ్తున్నారు. ఈ సమయంలో వారిపై రాళ్లు రువ్వడంతో పలువురు మహిళలు గాయపడ్డారు. ఈ రాళ్లదాడి ఘటనతో ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొందని వెల్లడించారు. రాళ్ల దాడి ఘటనపై సమాచారం అందిన వెంటనే నూహ్ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజార్నియా భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొంతమంది మహిళలు బావికి పూజలు చేసేందుకు వెళ్తున్నారని..ఈ సమయంలో మదర్సా వద్ద వారిపై రాళ్లు రువ్వినట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ రాళ్లదాడిలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని నూహ్ పోలీసు సూపరింటెండెంట్ బిజార్నియా తెలిపారు.
ఇది కూడా చదవండి : పెళ్లి వేడుకకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి