మాస్ మహారాజ్ రవితేజ, నుపూర్సనన్, గాయత్రి భరద్వాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ఓటీటీలోకి వచ్చేసింది. రేణుదేశాయ్, అనుపమ్ఖేర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల అయింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అయిన ఈ సినిమా ఎక్కువ నిడివి కారణంగా మొదట డివైడ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సుమారు 20 నిమిషాల పాటు నిడివి తగ్గించడంతో సినిమాపై ప్రేక్షకులు అభిప్రాయం మారింది. తాజాగా ఈ సినిమా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు.
Read Also: పెళ్లి వేడుకకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి
రవితేజ సినిమా ఓటీటీలోకి రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటలో ఉంది.