విరుష్క జంట మరోసారి శుభవార్త చెప్పబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట.. త్వరలోనే మరో బిడ్డకు వెలకం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ముంబైలోని ఓ గైనకాలజిస్ట్ను సంప్రదించినట్లు సమాచారం. అప్పటినుంచి అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాము త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని.. మీడియా వాళ్లు దయచేసి ఫోటోలు తీయవద్దని కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు రిక్వెస్ట్ చేసినట్లు టాక్. నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంటారని అందరూ భావిస్తున్నారు.
Read Also: 22 ఏండ్లుగా జైలులో ఉంటూ.. విడుదల కావాల్సిన రోజే తప్పించుకున్న ఖైదీ
కాగా.. కొన్నాళ్ల పాటు ప్రేమాయణం నడిపిన కోహ్లీ, అనుష్క శర్మ 2017లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. 2021లో ఈ దంపతులు వామిక అనే బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. అనుష్క శర్మ మాత్రం కొంతకాలంగా నటనకు దూరంగా ఉండి.. తన సమయాన్ని పూర్తిగా వామిక కోసమే కేటాయిస్తోంది.