Sunday, May 19, 2024

పవన్‌ కల్యాణ్‌కు పోలీసుల నోటీసులు

spot_img

ఏపీ:  కృష్ణా జిల్లాలో పవన్ వారాహి యాత్ర జరుగనున్నది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఏపీ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఏ ఆధారాలతో పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేశారో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. యాత్రపై దాడులు జరుగుతాయనే సమాచారం ఎక్కడి నుంచి, ఎవరు ఇచ్చారనే సమాచారం అందజేయాలని నోటీసుల్లో కోరినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Also Read.. ప్రపంచ కప్ చరిత్ర: భారత టాప్ 10 బ్యాటర్లు, వికెట్ టేకర్స్ గురించి తెలుసా?

అంతకుముందు మచిలీపట్నంలో జనసేన భరోసా కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమ యాత్రను ఎతాగైనా అడ్డుకునేందుకు అధికార వైసీపీ పార్టీ కుట్ర చేస్తుందని, యాత్రపై  రాళ్ల దాడికి ప్లాన్‌ చేశారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేశారు.  అల్లరిమూకలతో గొడవలు సృష్టించి భయబ్రాంతులకు గురి చేయాలని, కేసులతో ఇబ్బందులు పెట్టాలని ప్రణాళిక రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.

Latest News

More Articles