హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు అందాయంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి వరలక్ష్మి శరత్కుమార్ స్పందించారు.ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ఓంకార్ దర్శకత్వంలో వరలక్ష్మి శరత్కుమార్, అవికాగోర్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ వెబ్సిరీస్ ‘మాన్షన్ 24’.. ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఇందులో పాల్గొన్న వరలక్ష్మి శరత్కుమార్ డ్రగ్స్ కేసు, నోటీసుల ప్రచారంపై స్పందించారు.
Also Read.. ఏషియన్ గేమ్స్లో గత రికార్డును బద్దలుకొట్టిన భారత్
డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు ఎలాంటి నోటీసులు, ఫోన్ కాల్స్ రాలేదని పేర్కొన్నారు. గతంలో తన వద్ద ఆదిలింగం అనే వ్యక్తి ఫ్రీలాన్స్ మేనేజర్గా వర్క్ చేశారని, ‘సర్కార్’తోపాటు ఆయన తీసుకువచ్చిన మూడు నాలుగు సినిమాల్లో నేను నటించినట్లు తిపారు. అంతే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి తనకు ఏమీ తెలియదన్నారు.