హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ముఖ్యనేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సీనియర్ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, పార్థసారథితో పాటు ఏపీకి చెందిన వేలాది మంది ఈ నెల 2న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ లో ఏపీ నేతల చేరికలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ విద్యార్థి యువజన జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ హర్షం వ్యక్తం చేశారు. నేతల నిర్ణయంతో ఏపీ భవిష్యత్కు బంగారు బాటలు పడ్డాయని స్టూడెంట్స్ జేఏసీ అభిప్రాయపడింది.
చారిత్రక ఉద్యమనేతగా, పరిపాలనధక్షుడిగా, సకల జనుల సంక్షేమం దిశగా పాలన వ్యవస్థను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడి ద్వారానే ఏపీ రాష్ట్ర సమస్యలు తీరి అభివృద్ధి చెందుతుందన్నారు. మోదీ అన్యాయమైన విధానాలను ఎదిరించి సకల సమస్యల నుంచి భారతదేశాన్ని గట్టెక్కించే ఏకైక నేత కేసీఆర్ మాత్రమేనన్నారు.