శంషాబాద్: దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడి వద్ద 16 లక్షల విలువైన అక్రమ బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
దుబాయ్ నుండి IA 952 విమానంలో హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు నిందితుడు వచ్చాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
283 గ్రాముల బంగారాన్ని పొడిగా మార్చి లోదుస్తుల్లో దాచుకుని రావడంతో స్కానింగ్ చేసి గుర్తించినట్లు ఆధికారులు వెల్లడించారు.
బంగారం స్వాధీనం చేసుకొని నిందితుడిపై విచారణ చేపట్టామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 16 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.