న్యూఢిల్లీ : భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర(22) రికార్డు సృష్టించాడు. బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో రజత పతకం సాధించాడు. దాంతో ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు కూడా దక్కించుకున్నాడు. ఇండియా నుంచి 2024 విశ్వక్రీడలకు అర్హత సాధించిన తొలి ఆర్చర్గా గుర్తింపు సాధించాడు.
Also Read.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదు.. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జిహ్ సియాంగ్ లిన్తో పోటీపడిన ధీరజ్ 5-6 (29-28, 27-29, 28-28, 30-28, 25-26) (9-10) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో భారత సీనియర్ ఆర్చర్ తరుందీప్ రాయ్ ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.