Tuesday, May 7, 2024

కేసీఅర్ చెప్పారు అంటే.. చేసి చూపిస్తారు

spot_img

ఖమ్మం జిల్లా: ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఖమ్మం నగరంలోని 25, 26, 37, 38వ డివిజన్లలో ఆయన ప్రచారం నిర్వహించారు. వీధుల్లో రోడ్ షో నిర్వహించి ఓటర్లను పలకరిస్తూ.. తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న ఖమ్మంను కాంగ్రెస్ చేతిలో పెట్టి మళ్ళీ ఆగం చేసుకుందామా అని ప్రశ్నించారు. ప్రతి డివిజన్ లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ లు వేసుకున్నామని, ఇంకా అద్భుతంగా చేసుకోవాలి అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని వివరించారు.

Also Read.. ఇచ్చిన మాటను నెరవేర్చే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్

గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్.. 60ఏళ్లు పాలించి ఖమ్మంకు చేసింది శున్యం అని, ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే అభివృద్ధిని పరిచయం చేశామని పేర్కొన్నారు.  కేసీఆర్ భీమా.. ప్రతి ఇంటికి ధీమా.. ను కల్పిస్తుందన్నారు. గెలిచిన తరువాత అన్నపూర్ణ పథకం ద్వారా మార్చ నెల నుండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి సన్న బియ్యం ను ఇవ్వనున్నామని, కేసీఅర్ ఆరోగ్య రక్ష పథకం ద్వారా రూ.15లక్షల వరకు మెడికల్ అసిస్టెన్స్ ను పెంచనున్నట్లు పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ రూ.400 కే ఇస్తామని ప్రకటించారు. కేసీఅర్ చెప్పారు అంటే చేసి చూపిస్తారు అని అన్నారు.

Latest News

More Articles