Friday, May 3, 2024

ఈటల, రేవంత్ పై మంత్రి తలసాని ఫైర్

spot_img

హైదరాబాద్:  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండి పడ్డారు. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడని విమర్శించారు. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. హోదా కలిగిన వ్యక్తి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యాడు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదు.. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని, ప్రజలు వీడి భాషను గమనించాలని కోరారు. రేవంత్ రెడ్డి ఒక్కడికే వస్తుందా ఆ భాష అని ప్రశ్నించారు. తాము కూడా మాట్లాడగలమని, నీచంగా మాట్లడటం  ఎంత వరకు సబబు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దీనిని గమనించాలని సూచించారు. మళ్ళీ మూడో సారి తామే అధికారం లోకి వస్తున్నామని స్పష్టం చేశారు.

Also Read.. రాత్రి 8 నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి

హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ సభ ఈనెల 25న ఉంటుందన్నారు. ఒకటి రెండు రోజుల్లో సభ స్థలం ఖరారు చేస్తామని తెలిపారు. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరు అతిగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, హుజురాబాద్ లో ఈటెల ఇద్దరు ఓడిపోడుతున్నారని మంత్రి తలసాని జోస్యం చెప్పారు.

Latest News

More Articles