వైజాగ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా సరికొత్త రికార్డును సృష్టించాడు. మొత్తం ఆరు వికెట్లను పడగొట్టి టెస్టుల్లో అత్యంత వేగంగా(34 మ్యాచులు) 150 వికెట్లు తీసుకున్న భారత పేస్ బౌలర్ గా నిలిచాడు.
అశ్విన్ 29 మ్యాచుల్లో,జడేజా 32 మ్యాచుల్లో ఈ మైలు రాయిని చేరారు. వేగంగా 150 వికెట్లు తీసిన తొలి ఐదుగురు భారత బౌలర్లలో బుమ్రా మాత్రమే పేసర్.
ఇది కూడా చదవండి: ప్రతి ఆటో కార్మికుడికి నెలకు రూ.10వేల భృతి చెల్లించాలి