Thursday, May 2, 2024

పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న యువతుల ముఠా అరెస్ట్

spot_img

పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‎లోని పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది అమ్మాయిలు ముఠాగా ఏర్పడి గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నారు. వీరి నుంచి 10 గ్రాముల ఎండిఎంఏతో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్‎లోని నోవాటెల్ ఆర్టిస్ట్రీ, ఎయిర్ లైవు, క్లబ్ రౌగ్, క్లబ్ రాక్ పబ్బుల్లో ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు. పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న మిథున, కొంగాల ప్రియలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో నలుగురు కలిసి గత కొంతకాలం నుంచి డ్రగ్స్ అమ్ముతున్నట్లు తేలింది. వీరంతా బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు.

Read Also: సూసైడ్ చేసుకున్న మహిళా న్యాయమూర్తి

Latest News

More Articles