Sunday, May 19, 2024

చలిలోనూ రాముడిని చూసేందుకు ఉత్సాహం.. నిన్నఎంత మంది దర్శించుకున్నారంటే..!!

spot_img

అయోధ్యలో రాంలల్లా దర్శనానికి భక్తుల్లో ఉత్సాహం తగ్గడం లేదు.నేడు ఉదయం తేలికపాటి పొగమంచు కురుస్తోంది. అయినా కూడా చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు రామజన్మభూమి ఆలయానికి చేరుకుని రాంలల్లాను దర్శనం చేసుకుంటున్నారు. శుక్రవారం రాంలాలా దర్శనానికి వచ్చిన వారి సంఖ్య మూడు లక్షలకు పైగానే ఉన్నట్లు సమాచారం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

అయోధ్య జోన్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు పెద్దఎత్తున ఇక్కడికి వస్తున్నారని… నిన్న కూడా 3 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారని.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. అయోధ్యలోని సరయూ ఘాట్ వద్ద ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గింది.

ఇది కూడా చదవండి: టీటీడీ కీలక నిర్ణయం…గోవింద కోటి రాస్తే యువతకు బ్రేక్ దర్శనం..!!

Latest News

More Articles