Friday, May 17, 2024

మాపై వివక్ష ఎందుకు.. మాకు ఏమైనా బిక్షం వేస్తున్నావా

spot_img

బీసి బిల్లు పెట్టకుండా మోడీ మోసం చేస్తున్నాడని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ‘మహిళ రిజర్వేషన్లు సభలో పసయ్యింది మేము సంతోషిస్తున్నాం. పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బిసి బిల్లు కోసం వందల సార్లు ధర్నాలు చేశాం. బీసీలకు మొండి చెయ్యి చూపారు ఈ మోడీ. బీసీ ప్రధాని అయి ఉండి బిసి రిజర్వేషన్లు పెట్టకపోవడం దారుణం. నిన్న ప్రధానిని కలిశాను బీసీ లకు న్యాయం చేస్తాం అన్నారు. బీసీలు అంటే భిక్ష గాళ్ళు కారు.మేము దేశంలో 56 శాతం ఉన్నాం ఎందుకు మాపై వివక్ష ..మాకు ఏమైనా బిక్షం వేస్తున్నారా.. బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు.బీసీలకు ఏ పథకాలు పెట్టావు. పశువులకు ప్రత్యేక శాఖ ఉంది కాని బీసీలకు మంత్రిత్వశాఖ లేదు.

బిసిలు ఏమైనా పశువుల కంటే అద్వాన్నమా.. మేము ఎందుకు ఉరుకుంటాం. మహిళ రిజర్వేషన్లు పెట్టారు కానీ అవి ఎవరికి ఉపయోగం. మీరు పెట్టిన మహిళ రిజర్వేషన్లతో పేద మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదు. అందరూ ఏకమై బీసీ బిల్లు కోసం పోరాటం చేయాలి. అన్ని శాఖల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలి. 75 యేండ్లు అయితే కూడా బీసీలకు న్యాయం జరగకపోతే ఎలా.. కేంద్ర ప్రభుత్వం లో బీసీలకు ఒక్క మంత్రిత్వశాఖ లేదు,పథకాలు లేవు…నిధులు లేవు. బిసిలు గొంగడి కప్పుకొని పంటే ఇవన్నీ రావు …పోరాటం చేయాలి అప్పుడే మన హక్కులు సాధిస్తాం.

Latest News

More Articles