Sunday, May 19, 2024

చేతి పంపు నుంచి తెల్లటి నీరు.. ఎగబడిన జనం.. వైరల్ వీడియో

spot_img

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. బిలారీ రోడ్‌వేస్ బస్టాండ్‌లో ఉన్న చేతి పంపు నుంచి తెల్లటి పాల లాంటి నీరు బయటకు వచ్చింది. దీంతో అక్కడి జనాలు అది చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా దానిని తీసుకెళ్లడానికి కూడా ఎగబడ్డారు. ఇళ్ల నుంచి బకెట్లు, ప్లాస్టిక్ సంచులు తెచ్చుకుని తీసుకుపోయేందుకు పెద్ద సంఖ్యలో గుమ్మికూడారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పరిపాలన అధికారులు.. అక్కడికి వెళ్లి పరిశీలించారు. చేతిపంపు దగ్గర ఓ ప్లాట్ ఫాం ఉంది. అది విరిగిపోవడం వల్ల నీటిలో ఏదో ఒక పదార్ధం కలిసి ఇలా తెల్లగా నీరు బయటకు వస్తోందని.. అది కలుషిత నీరని అధికారులు తెలిపారు. అది కలుషిత నీరని తెలుసుకున్న స్థానికులు బయట పడేశారు.

Read also: జనవరిలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు

Latest News

More Articles