Tuesday, May 7, 2024

కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దు

spot_img

మరో రెండు రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు మంత్రి కేటీఆర్. ప్రస్తుత అభివృద్ధికన్నా మరో పదింతలు రెట్టింపు అభివృద్ధి చేస్తామన్నారు. ఇవాళ(సోమవారం) చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కేటీఆర్ రోడ్ షో లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోందని, వారి మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారన్నారు మంత్రి కేటీఆర్. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తొలగించి, మరింత అభివృద్ధి చేసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 24గంటల కరెంటు అందుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు. గత కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి ప్రస్తుత సుమన్ చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ఓటువేయాలని కోరారు మంత్రి కేటీఆర్.

ఇది కూడా చదవండి: జనవరిలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు

Latest News

More Articles