Friday, May 17, 2024

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై బీజేపీ నాయకుల దాడి

spot_img

మద్యం మత్తులో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి మీద దాడికి తెగబడ్డారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భూక్యా జాన్సన్ నాయక్ రజూరా గ్రామ పర్యటనలో ఉన్నారు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన బీజేపీ మాజీ ఎంపీపీ భర్త గడ్డం రవీందర్ తన అనుచరులతో అటుగా వచ్చారు. మద్యం మత్తులో ఉన్న గడ్డం రవీందర్ అయన అనుచరులు.. భూక్యా జాన్సన్ నాయక్ కారును ఢీకొట్టారు. అంతేకాకుండా జాన్సన్ మీద దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు సమాచారమిచ్చారు.

మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాల కూల్చివేత

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మద్యం మత్తులో దాడిచేసిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‎కు తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేత, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తన అనుచరులతో పోలీస్ స్టేషన్‎కు చేరుకొని వీరంగం సృష్టించారు. పోలీసులపై దాడి చేసే విధంగా బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అంతేకాకుండా.. స్టేషన్‎లోని కిటికీలు, తలుపులను విరగ్గకొట్టి హంగామా చేశారు.

Read Also: మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి

Latest News

More Articles