Sunday, May 19, 2024

కోరుట్లలో బీజేపీకి భారీ షాక్‌!

spot_img

కోరుట్ల : కోరుట్లలో కమలం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన చెందిన ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, టౌన్ అధ్యక్షుడితో పాటు దాదాపు 200 మంది నాయకులు పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.

కోరుట్ల టౌన్ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్, 11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునిత, 12వ వార్డు కౌన్సిలర్ అలేఖ్య, ఆమె భర్త మురళీ గులాబీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి ముఖ్యమైన నాయకులు బీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

Latest News

More Articles