Sunday, May 5, 2024

కాంగ్రెస్ వస్తే ఆగం అవుతాము.. కాంగ్రెస్ చాలా డేంజర్

spot_img

యాదాద్రి జిల్లా : బీఆర్ఎస్ సభలల్లో జన సునామీ కనిపిస్తుందని, అదే సమయంలో కాంగ్రెస్ వాళ్ల మీటింగ్ లకు మాత్రం జనాలు రావడం లేదని మంత్రి హరీష్ రావు తెలిపారు. 80 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నదని పేర్కొన్నారు. కొండ పోచమ్మ సాగర్ నుండి  గోదావరి నీళ్లను ఆలేరు నియోజకవర్గంలోకి తెచ్చామన్నారు. ఎండ కాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరంట్ రాలే.. అన్నదాతలు ఆగం అయ్యారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గం బొమ్మల రామారం మండలంలో చికటిమామిడి  గ్రామంలో ఎమ్మెల్యే  అభ్యర్థి గొంగిడి సునీత గెలుపు కోరుతూ మంత్రి హరీష్ రావు రోడ్  షో నిర్వహించారు.

Also Read.. రేవంత్ రెడ్డి ఇదే మా చివరి హెచ్చరిక

రేవంత్ పాగల్ లాగా మాట్లాడుతున్నాడు. రేవంత్ 3 గంటలు కరంట్ చాలు అంటున్నాడు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ మళ్ళీ  కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపెట్టాడు. 5 గంటలు కరంట్ ఇస్తాం అని కుండ బద్దలు కొట్టాడు. కర్ణాటక ప్రజలు ఓటేస్తే కాంగ్రెస్ అన్ని బంద్ చేసిండ్రు. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ , ప్రియాంకా గాంధీ  లు వచ్చి పచ్చి  అబద్ధాలు చెపుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళది సుతి లేని సంసారం లాంటింది. కాంగ్రెస్ కు ఓటేస్తే కరంట్ మాయం అవుతుంది. తెలంగాణా కుక్కలు చింపిన విస్తారకు అవుతుంది. బీఆర్ఎస్ గెల్చిన తర్వాత 5 వేల ఆసరా పెన్షలు అందిస్తాం. అన్నదాతలు అంటే కేసీఆర్ కు ప్రాణం అని పేర్కొన్నారు.

Also Read.. మలక్ పెట్ లో టీవీ టవర్ ని మరిపించేలా ఐటీ టవర్.. తనది బాధ్యత: కేటీఆర్

రైతు బంధు ఇవ్వండి అని హైకోర్టు చెప్పింది. న్యాయం గెలిచింది. కాంగ్రెస్ వాళ్లకు  చెంపపెట్టు లాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరో మూడు రాజుల్లో అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమవుతాయి. కాంగ్రెస్ వాళ్ళు  రైతుకు 15 వేలు మాత్రమే ఆర్థిక సాయం ఇస్తాం అంటున్నారు. రైతుకు ఎన్ని ఏకరాలున్న 15 వేలు మాత్రమే ఇస్తారట. ఆ కుట్రను అన్నదాతలు గమనించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నిబియ్యం ఇస్తాం. సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు 3 వెల పెన్షన్ ఇస్తాం. కాంగ్రెస్ వస్తే ఆగం అవుతాము. కాంగ్రెస్ చాలా డేంజర్. కాంగ్రెస్ అంటేనే భస్మాసుర హస్తం. అధికారంలోకి రాగానే రుణమాఫీ పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Latest News

More Articles