Sunday, May 12, 2024

రేవంత్ రెడ్డి ఇదే మా చివరి హెచ్చరిక

spot_img

కొడంగల్: రేవంత్ రెడ్డి ఇదే మా చివరి హెచ్చరిక మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని కోడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి  హెచ్చరించారు. కోస్గిలో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇదే నీ చివరి హెచ్చరిక మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.  కొడంగల్ నియోజకవర్గంలో కార్యకర్తలను నాయకులను మభ్యపెట్టి దౌర్జన్యాలకు పాల్పడితే  చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

చైర్మన్ ఇంటికి గాని కార్యకర్తలను భయాందోళన గురిచేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. వెంటనే దౌర్జన్యాలను ఆపాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కొడంగల్ లో నామినేషన్ వేసినప్పుడు నుంచి  కొడంగల్ లో  అల్లలు చెల్లరేగుతున్నాయని తెలిపారు. కొడంగల్ ను మరో రాయలసీమగా మారుస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఓటమి భయంతోనే అడ్డదారులు గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు.

డబ్బు మద్యం పంచి కార్యకర్తలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.  కొడంగల్ రేవంత్ రెడ్డి ఓటమి తప్పదని ఈ నెల 30న ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారని అన్నారు. ఈనెల 28న  రైతులకు పెట్టుబడి సహాయం కింద  రైతుబంధు ఖాతాలో జమ చేస్తారని తెలిపారు. ఈ రైతుబంధు కార్యక్రమం రేవంత్ రెడ్డికి చెప్పదెబ్బ లాంటిదని ఎద్దేవా  చేశారు చేశారు.

Latest News

More Articles