భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడులో విషాదం నెలకొంది. పుస్తకాలకు పైసలు ఇవ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెండలపాడు గ్రామానికి చెందిన సుధీర్ బాబు(11) పుస్తకాల కోసం తన తల్లిదండ్రులను పైసలు అడిగాడు.
Also Read.. ఎన్నికల్లో నాకు సరైన పోటీ లేకుంటే మజా ఉండదు
అయితే, పేరెంట్స్ డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయిన సుధీర్ బాబు.. తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.