తమిళనాడులోని కోయంబత్తూర్లో విషాదకర ఘటన చోటుచేసుకున్నది. ఓ దేవాలయం వద్ద నిద్రిస్తున్న 60 ఏండ్ల వృద్ధుడిని అడవి ఏనుగు తొక్కి చంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుప్పూర్ జిల్లా వాడవేదంపట్టి గ్రామానికి చెందిన జీ షణ్ముగసుందరం గత ఏడాది కాలంగా మంగళపాలయం తూర్పు అటవీ సరిహద్దుల్లో ఉన్న ఓ దేవాలయం పరిసరాల్లో ఉంటున్నాడు.
Also Read.. ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదలకు ముందు నిర్మాతకు భారీ షాక్
మంగళవారం రాత్రి ఓ అడవి ఏనుగు ఆలయం వద్దకు చేరుకున్న బీభత్సం సృష్టించింది. అక్కడే పడుకున్న షణ్ముగసుందరంపై దాడి చేసింది. అతన్ని తొక్కి చంపింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. బీభత్సానికి పాల్పడిన అడవి ఏనుగు సమీప అడవుల్లో నుంచి జనావాసాల్లోకి ప్రవేశించినట్లు అధికారులు నిర్ధారించారు.