Tuesday, May 21, 2024

మైనంపల్లిని హెచ్చరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు

spot_img

మల్కాజిగిరి: మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ కార్యకర్తలకు చేసింది ఏమీ లేదని, కార్యకర్తలను బెదిరించి కాంగ్రెస్ కండువాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మైనంపల్లికి తగిన గుణపాఠం చెబుతామని మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరించారు. ఉద్యమకారులను మైనంపల్లి అణచివేశారని,  ఆపదలో ఉన్న ఏఒక్క ఉద్యమకారున్ని ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read.. కాంగ్రెస్ లో 100 టికెట్లు.. 101 ధర్నాలు

మైనంపల్లి ఎన్ని భయభ్రాంతులకు గురి చేసిన బిఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని మర్రి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్, సునీత రామ్ యాదవ్, నేరేడుమెట్  కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి ,మల్కాజ్గిరి 140 డివిజన్ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Latest News

More Articles