Sunday, May 19, 2024

దొడ్లలో చెప్పులు మోస్తారంటూ.. ఎరుకల జాతిని అవమానించిన రేవంత్ రెడ్డి

spot_img

తనకి రావాల్సిన ఎమ్మెల్సీ పదవి రాకుండా చేసిన గవర్నర్ పై మాజీ ఎమ్మెల్యే కె .సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నేను గవర్నర్ భాదితుణ్ణే అంటూ వాపోయాడు. ‘దాదాపు 40 యేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా. నాది తెరచిన పుస్తకం లాంటి జీవితం. ఎలాంటి మచ్చ లేదు. నా కులం ఎరుకల అయినప్పటికీ జనరల్ సీటులో ఎమ్మెల్యే గా గెలిచిన చరిత్ర నాది. ఎరుకల కోసం కేసీఆర్ మంచి స్కీంలు తెచ్చారు. అంతకుముందు ఎరుకల గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. నా సేవలను గుర్తించి కేసీఆర్ గారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా నామినేట్ చేశారు. ఎరుకల జాతి నుంచి కనీసం ఎంపీటీసీ కూడా లేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ గా నామినేట్ చేశారు.

రాజ్యాంగ పరిరక్షరాలిగా ఉండాల్సిన గవర్నర్ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. నా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించిన తీరు భాధ కలిగించింది. కోదండ రామ్ కు ఉన్న అర్హత ఏమిటీ ..నాకు లేనిదేమిటి ? సీఎం రేవంత్ దొడ్లలో చెప్పులు మోసే వారికి కేసీఆర్ ఎమ్మెల్సీ లుగా నామినేట్ చేశారనడం బాధాకరం. నా జాతిని రేవంత్ అవమాన పరిచారు. సమాజం లో మా లాంటి గరీబోళ్ల కు స్థానం లేదా. రేవంత్ అహంకారం తగ్గించుకోవాలి. సీఎం పద్దతిగా మాట్లాడటం నేర్చుకోవాలి. రేవంత్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. నేను ఎవ్వరి చెప్పులు మోయ లేదు అని అన్నాడు.

 

Latest News

More Articles