Monday, May 20, 2024

కేసీఆర్ ఫామ్ హౌస్‌ను ముట్టుకుంటే ముక్కలు ముక్కలు చేస్తాం

spot_img

హైదరాబాద్: కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడులు చేస్తామని మధుయాష్కీ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, తమపై రోజుకో ఆరోపణ చేస్తుందని మండిపడ్డారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టుకుంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టుకుంటే ముక్కలు ముక్కలు చేస్తామని హెచ్చరించారు. పాలన మీద దృష్టి పెట్టకుండా తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సాకు చూపించి.. హామీల అమలు ఎగవేసే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే 50 రోజులు గడిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా సగం రోజులే మిగిలి ఉన్నాయన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.

Also Read.. డివైడర్‌పై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Latest News

More Articles