Saturday, May 18, 2024

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయం

spot_img

వరంగల్ జిల్లా : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలుస్తారని, అత్యధిక మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణ కేంద్రంలోని పద్మశాలి గార్డెన్స్ లో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

పాఖాల రంగయ్య చెరువుకు గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. కరోనా సమయంలో నర్సంపేట నియోజకవర్గంలో ప్రతీ  ఒక్కరిని కంటికి రెప్పలా కపడుకున్నామని స్పష్టం చేశారు. నర్సంపేట  నియోజవర్గంలో వికలాంగులకు త్రీ వీలర్ బైకులు ఇచ్చిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు.

Also Read.. లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

Latest News

More Articles