Monday, May 20, 2024

డివైడర్‌పై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

spot_img

ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌పై దూసుకుపోయింది. ఈ సంఘటన ఆలేరు లోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై గల కందిగడ్డ తండా శివారులో జరిగింది. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ పై దూసుకుపోయింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా కొద్ది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించి…మిగతా ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: శుభవార్త.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్..!

Latest News

More Articles