తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్కును టీఎస్ నుంచి టీజీకి మారుస్తూ కేంద్ర రహదారి రవాణాశాఖ కార్యాలయం మంగళవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం 1988లో ని సెక్షన్ 41 (6) కింద ఉన్న అధికారులను ఉపయోగించి 1989 జూన్ 12న అప్పటి ఉపరిత రవాణా శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఆ నోటిఫికేషన్ లోని టేబుల్ లో సీరియన్ నెంబర్ 29ఏ కింద, తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో టీజీ మార్క్ కేటాయించినట్లు తెలిపింది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టి తర్వాత వాహణ రిజిస్ట్రేషన్ మార్క్ లో మార్పు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు రాష్ట్ర మంత్రి వర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. దాన్ని అనుసరించి కేంద్ర సర్కార్ మార్పు చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీజీగా మారనుంది.
ఇది కూడా చదవండి: అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత